ఆదివారం 24 ఎప్రిల్ 2011

అయిపోయింది ....

ఒక అనామకుణ్ణి పిలిచి ఆదేశించి ప్రయోజకుణ్ణి చేసిన గురువుని పోగొట్టుకున్నాను.

ఈలోపుగానే అనుకున్నవన్నీ అక్షరం పొల్లుపోకుండా అయిపోయినాయ్‌.

అదుగో ఇప్పుడే తెల్ల చొక్కాలేసుకుని చిరంజీవి , చంద్రబాబు, ఆనం సోదరులు టీవీ కవరేజిలకి రెడీ అయిపోయారు.


ట్రస్టు కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయని సీఎం కిరణ్‌ గారు శెలవిచ్చేశారు. మన్మోహన్‌ సింగు గారు సంతాపం ప్రకటించేశారు. డిల్లీ నుంచి జానారెడ్డి గారు లైవ్‌ లో మాట్లాడేస్తున్నారు. ఒక సేవకుణ్ణి కోల్పోయామని సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పేశారు. ఎక్కణ్ణించో జైపాల్‌ రెడ్డి గారు దిగిపోయారు. పదవికోసం అలమటిస్తున్న రాయపాటి సాంబశివరావు గారు ట్రస్ట్‌ కు అధిపతి అయిపోయారు. ఇవన్నీ టీవీ 9 లో నిరాటంకంగా ప్రసారమైపోతున్నాయి.

అయిపోయింది, ఇంకేమి మిగిలుంది, నాలుగు సంతాపదినాలు, చూడ్డానికొచ్చిన మనిషికో నాలుగు చుక్కల చొప్పున కన్నీటిసుక్కలు. నాలుగు స్టేట్‌ మెంట్లు, జయంతులూ, వర్ధంతులూ.

లక్షా 46 వేల కోట్లు .. ఖతం .. మూడు ఎన్నికలు ఎదుర్కోవచ్చు, లక్ష మంది కార్యకర్తలని 20 యేళ్ళదాకా నెలజీతాలిచ్చుకుని కాపాడుకోవచ్చు, మన మీద మన ఫామిలీ గొప్పతనం మీద ఓ వెయ్యి టీవీ ప్రోగ్రాం లు చేసుకోవచ్చు. మన పర్సనల్‌ స్విస్‌ బాంక్‌ అకౌంట్‌ లోకి లెక్కలేనన్ని కోట్లు చేర్చుకోవచ్చు.

ఖతం ..

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి